పెంజర్ల(కొత్తూరు) : మొక్కల సంరక్షణను ప్రతిఒక్కరూ తమ బాధ్యతగా తీసుకోవాలని మండల పరిధిలోని పెంజర్ల గ్రామ సర్పంచ్ వన్నం బాల్రాజ్ కోరారు. ఆయన ఆధ్వర్యంలో ఆదివారం మహిళా సంఘాలకు మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో పలుచోట్ల మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించినప్పుడే ఫలితం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుధాకర్, రమేష్, చెన్నారెడ్డి, జగన్, భీమయ్య, ఖదీరుద్దీన్, షాహినాబేగం, మహిళా సంఘాల సభ్యులు జహిదాబేగం, సుజాత, లక్ష్మి, ఫైమిదా తదితరులు పాల్గొన్నారు.