పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట

18 Dec, 2016 03:04 IST|Sakshi
పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట

విడదీసేందుకు తల్లిదండ్రుల ప్రయత్నం
రక్షణ కల్పించిన టూ టౌన్‌ పోలీసులు


మదనపల్లె టౌన్‌ : వారు వేర్వేరు మతాలకు చెందిన వారు. ఇద్దరి భావాలు కలవడంతో ప్రేమలో పడ్డారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కలిసి జీవించాలని భావించారు. ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ప్రేమజంటను విడదీయాలని విశ్వప్రయత్నం చేశారు. ఇద్దరూ మేజర్లు కావడంతో యువతి తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో కథ సుఖాంతమైం ది. ఈ సంఘటన మదనపల్లెలో శనివారం చోటుచేసుకుంది. ప్రేమికుల కథనం మేరకు.. మదనపల్లె మండలం సీటీఎం పంచాయతీ క్రాస్‌ రోడ్డు లో నివాసముంటున్న ఎస్‌ఏ ఖాదర్‌ కుమారుడు మహమ్మద్‌గౌస్‌(30) ఐదేళ్లుగా హైదరాబాదులోని సీఎం పేషీ స్కిల్‌డెవలప్‌మెంట్‌లో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. విజయవాడకు చెందిన కొత్తపల్లె దస్మంతరావు కుమార్తె శిల్ప(28) హైదరాబాదులోనే ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఇంజినీరుగా పనిచేస్తోంది. పక్కపక్కనే నివాసం ఉన్న ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది.

నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలిసిం ది. దీంతో శిల్పకు మరో వ్యక్తితో పెళ్లి చేయడానికి రంగం సిద్ధం చేశారు. దీంతో ఇద్దరూ రెండు వారాల క్రితం ఇంటి నుంచి పారిపోయి హైదరాబాదు సమీపంలోని ఓ ఆలయంలో మతాంతర వివాహం చేసుకున్నారు. అనంతరం ప్రియుడి స్వగ్రామమైన మదనపల్లె మండలం సీటీఎం చేరుకున్నారు. అమ్మాయి తరపు నుంచి ప్రమాదం పొంచి ఉందని భావించి స్థానిక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పెళ్లిని రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న శిల్ప తల్లిదండ్రులు శుక్రవారం రాత్రి మదనపల్లె చేరుకున్నా రు. ప్రేమజం టను విడదీయడానికి రాజకీయ పలుకుబడి ఉపయోగించి విశ్వప్రయత్నా లు చేశారు. వారి కన్నుగప్పి టూటౌన్‌ పోలీసుస్టేషన్‌ చేరుకున్న ప్రేమజంట రక్షణ కల్పించాలని సీఐ హనుమంత్‌ నాయక్‌ను కోరారు. ఈ విషయం తెలియడంతో విలేకరులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇద్దరూ మేజర్లు కావడంతో వారి జోలి కి వెళ్ల వద్దని సీఐ అమ్మాయి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో సమస్య సద్దుమనిగింది.

మరిన్ని వార్తలు