సాక్షి, హైదరాబాద్: గుండెపోటుతో కన్నుమూసిన ‘సాక్షి’స్పోర్ట్స్ ఎడిటర్ బత్తినేని జయప్రకాశ్కు ‘సాక్షి’శనివారం ఘనంగా నివాళులర్పించింది. హైదరాబాద్ బంజారాహిల్స్లోని పత్రిక ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాక్షి చైర్పర్సన్ వైఎస్ భారతి.. జయప్రకాశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్రమూర్తి, డెరైక్టర్లు వైఈపీ రెడ్డి, కేఆర్పీ రెడ్డి, రాణిరెడ్డి, సాక్షి ఎడిటర్ వి.మురళి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్రెడ్డి, అసోసియేట్ ఎడిటర్ రాజమహేందర్రెడ్డి, హెచ్ఆర్ విభాగం ప్రెసిడెంట్ రాంప్రసాద్, సర్య్కులేషన్ విభాగం వైస్ ప్రెసిడెంట్ ఏవీఎల్ నర్సింహారావు, సీఎఫ్ఓ మహేశ్వరి, స్టోర్స్ ప్రెసిడెంట్ విమల్ తదితరులు నివాళులర్పించారు. జయప్రకాశ్తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.