కిడ్నాపైన చిన్నారి హత్య

7 Sep, 2016 23:59 IST|Sakshi
నీటితొట్టిలో ఉన్న సల్మా
– మిస్టరీని ఛేదించిన పోలీసులు
–మేనమామే హంతకుడు
శ్రీకాళహస్తి: సరిగ్గా వూటలు కూడా పలకలేని చిట్టితల్లి సల్మా అనంత లోకాలకు చేరిపోయింది. 13నెలల చిన్నారిని తల్లి పొత్తిళ్ళ నుంచి తస్కరించి అతికిరాతకంగా అంతమెుందించాడో నరరూపరక్షసుడు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో కువూరస్వామితిప్ప జానువీధికి అయేషా, కాలేషా దంపతుల కువూరె ్తసల్మా(13నెలలు) 1వతేది అర్ధరాత్రి దాటాక అదృశ్యమైంది. చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఇద్దరూ కలసి ఇల్లు, పరిసరాలంతా వెతికారు. ఆచూకి తెలియకపోవడంతో పోలీసులు ఫిర్యాదు చేశారు. వివరాలిలా.. కాలేషా చెల్లెలు పాతివూను మీర్జావలి అనే వ్యక్తికిచ్చి వివాహం చేశారు. కొంతకాలంగా కాలేషాకు,మీర్జావల్లికి వివాదాలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో కాలేషాపై మీర్జావలి  కక్షగట్టాడు. అతని బిడ్డను చంపాలని నిర్ణయించుకున్నాడు. 1వతేది రాత్రి తల్లి ఆయేషాతో నిద్రపోతున్న సల్మాను తస్కరించాడు. తర్వాత పట్టణంలోని ఎస్వీఏ డిగ్రీ కళాశాల సమీపంలోని పాడుపడిన భవనం వద్ద ఉన్న నీటితొట్టెలో పడేశాడు. తర్వాత కాలేషాతో కలసి బిడ్డ కోసం ఆన్వేషించినట్లు నటించారు.  పోలీసులు అనువూనంతో పలుసార్లు విచారించినా ప్రయోజనం లేదు. రెండురోజుల క్రితం తిరుపతి అర్బన్‌∙ఎస్పీ జయలక్ష్మి తిరుపతికి చెందిన క్రైం డీఎస్పీ నరసింహారెడ్డికి కేసు అప్పగించారు.  వారు వురోసారి మీర్జావలిని తమదైన శైలిలో విచారించారు. దీంతో బుధవారం రాత్రి 10గంటల సమయంలో మీర్జావలి నేరాన్ని అంగీకరించాడు. పోలీసులకు హత్య వివరాలను తెలియజేశాడు. తొట్టిలో ఉన్న చిన్నారి వుృతదేహాన్ని చూపించాడు. నీటిలో ఊపిరాడక చిన్నారి చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారి తల్లి అయేషా తండ్రి కాలేషాతోపాటు బంధువులు రోదిస్తున్నారు.
మరిన్ని వార్తలు