విభిన్న ప్రతిభావంతులకు సెన్సరీ పార్కు

12 Dec, 2016 15:07 IST|Sakshi
– జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌
కర్నూలు(అర్బన్‌): కర్నూలులో విభిన్న ప్రతిభావంతులకు రూ.6.50 కోట్లతో సెన్సరీ పార్కు  ఏర్పాటుకు   ప్రక్రియ కొనసాగుతుందని జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక నియామకాల ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 26 మంది  విభిన్న ప్రతిభావంతులకు  ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించామని, త్వరలో మరో 54 పోస్టులను వారితో భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.  
నేడు శోభయాత్ర 
ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం 9 గంటలకు అంబేడ్కర్‌భవన్‌ నుంచి శోభయాత్ర  నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. అనంతరం 10 గంటలకు సునయన ఆడిటోరియంలో ప్రత్యేక విద్య అభ్యసిస్తున్న దివ్యాంగులతో  ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, విభిన్న ప్రతిభావంతులు, ఆయా సంఘాలకు చెందిన నాయకులు హాజరు కావాలని కోరారు.
 
మరిన్ని వార్తలు