కరువుగోస పాదయాత్రలో సీపీఎం కార్యదర్శి తమ్మినేని
అచ్చంపేట/కల్వకుర్తి/నాగర్కర్నూల్: సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. మహబూబ్నగర్ జిల్లాలో చేపట్టిన ‘పాలమూరు కరువుగోస యాత్ర’ ఆదివారం అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్కర్నూల్ నియోజకవర్గాల్లో సాగింది.
ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తానని చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరువుతో అల్లాడుతున్న ప్రజల కోసం అన్ని పార్టీలు కలసిరావాలని కోరారు. కరువుతో గ్రామాల్లో పాడిరైతులు పశువులను అమ్ముకుంటున్నారని, కూరగాయల రైతులు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారని చెప్పారు.