కర్నూలు సిటీ: జిల్లా వ్యాప్త ఆదర్శ పాఠశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేందుకు డీఈఓ హామీ ఇచ్చినట్లు ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మన్న తెలిపారు. మంగళవారం ఎస్టీయూ నాయకులు డీఈఓను కలిసి పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాళ్లకు సంబంధించిన సంపాదిత సెలవులు సర్వీస్ రిజిస్టర్లో నమోదు.. గోనుగండ, జూపాడుబంగ్లా మోడల్ స్కూల్లో పని చేస్తున్న మహిళ టీచర్ల మాతృత్వ సెలవులు, సి.బెళగల్ స్కూల్లోని తెలుగు టీచర్ జీతం రాని విషయాన్ని డీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. వీరి వెంట ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి రఫీ, తదితరులు ఉన్నారు.