విశాఖ–కల్చరల్ ః భిన్నత్వంలో ఏకత్వాన్ని తెలిపే భారతీయ సంస్కృతిని ప్రతిబింభించే విధంగా ప్రదర్శించిన పలు ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పలు నాట్య సౌరభాలు రంజింప చేశాయి. దేభక్తిని చాటే వివిధ గీతాలు, భారతీయ జానపద నాట్యాలు చిన్నారులు ఓలాడించారు. వివిధ పాఠశాలలో చదువుతున్న చిన్నారులు జానపద కళారూపాలతో ఆకర్షణీయమైన డ్రెస్లు ధరించి ఉత్తరాంధ్ర యాసతో జానపద పాడుతూ ప్రదర్శించిన నాట్యాలు అలరించాయి.