శ్రీకాళహస్తిలో నిత్యానంద, రజిత

11 Mar, 2016 04:02 IST|Sakshi
శ్రీకాళహస్తిలో నిత్యానంద, రజిత

శ్రీకాళహస్తి(చిత్తూరు జిల్లా): వివాదస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానంద గురువారం శ్రీకాళహస్తిలో ప్రత్యక్షమయ్యారు. తన అనుంగు శిష్యురాలు రజితతో కలిసి శ్రీకాళహస్తీశ్వరున్ని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా నిత్యానంద అనుచరులు అత్యుత్సాహం ప్రదర్శించారు. నిత్యానంద, రజితలను చిత్రీకరిస్తున్న మీడియా సిబ్బందిని అడ్డుకున్నారు. ఫొటోగ్రాఫర్ల పట్ల దురుసుగా ప్రవర్తించారు. నిత్యానంద, రజిత మీడియాతో మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. భక్తులు మాత్రం వీరిద్దరినీ ఆసక్తిగా గమనించారు.

మరిన్ని వార్తలు