రాయచోటి : ఆలయ పూజారి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి మండలం మాధవరంలో గురువారం చోటు చేసుకుంది. స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజారిగా పని చేస్తున్న కాలువపల్లి లక్ష్మీ నరసప్ప(65) ఆలయ సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రాయచోటి ఎస్సై శ్రీ రమేష్ బాబు సంఘటనా స్థలానికి చే రుకొని దర్యాప్తు చేస్తున్నారు.