కాపుల ఆందోళనను అడ్డుకున్న పోలీసులు

12 Jun, 2016 11:34 IST|Sakshi

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ అరెస్టుకు నిరసనగా కంచాలతో ప్రదర్శన నిర్వహిస్తున్న కాపులను పోలీసులు అడ్డుకున్నారు. కాపు సామాజికవర్గానికి చెందినవారు ఆదివారం ఉదయం కంచాలు చేతపట్టుకుని నిరసనవ్యక్తంచేస్తూ ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు-ప్రదర్శనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది.

 

మరిన్ని వార్తలు