వంతెన అంచుపై వేలాడుతున్న లారీ

24 Sep, 2016 13:10 IST|Sakshi
వంతెన అంచుపై వేలాడుతున్న లారీ

మెదక్: మంజీరా నది పై లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి బ్రిడ్జ్ అంచున ఆగిపోయింది. ఈ సంఘటన మనురు మండలం రాయిపల్లి వద్ద శనివారం చోటు చేసుకుంది. వివరాలు.. బీదర్ వైపు పళ్లలోడుతో మంజీరా నది బ్రిడ్జ్ పై వెళుతుండగా లారీ టైర్ పంక్చర్ అయింది. దీంతో అదుపు తప్పి బ్రిడ్జ్ సైడ్ వాల్ను ఢీకొట్టి వాగువైపు దూసుకెళ్లింది.

అదృష్టవశాత్తూ బ్రిడ్జ్ అంచున ఆగిపోయి వేళాడుతోంది. లారీ క్యాబిన్ వాగు వైపు ఉండటంతో లారీ డ్రైవర్, క్లినర్లు చాలా సమయం వరకు లారీలోనే ఉండిపోవాల్సి వచ్చింది. లారీ బ్యాలెన్స్ తప్పి వాగులో పడిపోకుండా అటు వైపు ఎవరిని వెళ్లనివ్వకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.  
 

మరిన్ని వార్తలు