హరిత తెలంగాణ కు సాయమందించండి

20 Jul, 2016 01:48 IST|Sakshi
పల్లిపాడులో మొక్క నాటుతున్న ఎమ్మెల్యే మదన్‌లాల్‌
  • ఎమ్మెల్యే మదన్‌లాల్‌
  • పల్లిపాడు (కొణిజర్ల): ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలలు గన్న హరిత తెలంగాణ సాధించడానికి ప్రతి ఒక్కరి సాయం అవసమని ఎమ్మెల్యే బాణోత్‌ మదన్‌లాల్‌ అన్నారు.  పల్లిపాడులో ఫ్రెండ్స్‌యూత్‌ , జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, సీపీఎస్‌ వారి సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సుమారు 600 మొక్కలు నాటారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ జి.శ్రీలత, ఎంపీడీఓ శ్రీనివాసరావు,ఎంపీపీ వడ్లమూడి ఉమారాణి, జెడ్పీటీసీ తేజావత్‌ సోమ్లా, సర్పంచ్‌ ధనేకుల లలిత, ఎంఈఓ యం,శ్యాంసన్, ఫ్రెండ్స్‌ యూత్‌ అధ్యక్షుడు తాటిపల్లి సుధీర్, ప్రధానోపాధ్యాయులు శివనారాయణ, రమణ, టీఆర్‌ఎస్‌ నాయకులు మచ్చా వెంకటేశ్వరరావు, మండేపూడి సత్యనారాయణ, ఓర్సుప్రకాశ్, పాసంగులపాటి శివకుమార్, నాయుడు వెంకన్న, చల్లగుండ్ల నాగేశ్వరరావు, బాణోత్‌ నాగేశ్వరరావు, పాముల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు