నిప్పులాంటి భక్తి

18 Feb, 2016 00:20 IST|Sakshi

నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మం డలం చెర్వుగట్టులో అగ్నిగుండాలు ఘనంగా నిర్వహించారు. శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం తెల్లవారుజామున ఈ కార్యక్రమం నిర్వహిం చారు. పరిసర జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. యాదగిరిగుట్టకు చెం దిన జయప్రద, అయిలపల్లికి చెందిన అండాలు అగ్నిగుండంలో నడుస్తుండగా చీర కాళ్లకు తగిలి నిప్పుల్లో పడిపోయూరు. తీవ్ర గాయూలైన వారిని నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు.

>
మరిన్ని వార్తలు