వైఎస్ఆర్కి పేరొస్తుందనే...

18 Aug, 2016 15:32 IST|Sakshi
వైఎస్ఆర్కి పేరొస్తుందనే...

అనంతపురం : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి పేరొస్తుందనే.. చంద్రబాబు హంద్రీనీవా పట్టించుకోలేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. అనంతపురానికి కృష్ణా జలాలు తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్దే అని ఆయన గుర్తు చేశారు. గురువారం అనంతపురం జిల్లాలోని జీడిపల్లి రిజర్వాయర్లో ఆయన పుష్కర స్నానం చేశారు.

అనంతరం వై.విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ... ప్రతి ఏటా 15 టీఎంసీలు వస్తున్న ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని విమర్శించారు. డిస్ట్రిబ్యూటరీలను వెంటనే పూర్తి చేసి పంటలకు నీరు ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబుకు మంచి బుద్ది ప్రసాదించాలని వై.విశ్వేశ్వరరెడ్డి పూజలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు