అక్కడ ఓట్లు ఆరిన తర్వాతే కౌంటింగ్

13 May, 2014 14:16 IST|Sakshi

ఆచంట : పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని  పెనుగొండ, పెనుమంట్ర మండలాల ఓట్ల లెక్కింపు ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పెనుగొండ మండలానికి చెందిన 3 బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లు తడిచి ముద్దయ్యాయి. అధికారుల ఆదేశాల మేరకు సిబ్బంది వాటిని ఆరబెట్టే పనిలో పడ్డారు. దీంతో కౌంటింగ్ ఎప్పటికి పూర్తవుతుందోనని అభ్యర్ధుల్లో ఆందోళన నెలకొంది.

 

మరిన్ని వార్తలు