గడువు ముగిశాక టీవీల్లో ప్రచారం వద్దు

2 Apr, 2014 01:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు  జరుగుతున్నందున పోలింగ్‌కు  48 గంటల ముందు ఎలాంటి ప్రచారం చేయడానికి వీల్లేదని, టెలివిజన్ చానళ్లలోకూడా ఎలాంటి ప్రచారం నిర్వహించినా చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొదటి దశ ఎన్నికలు ఈనెల 4వ తేదీ సాయంత్రం ఐదు  నుంచి ఆరవ తేదీ సాయంత్రం ఐదు వరకు  ఎలాంటి ప్రచారం చేయడానికి వీల్లేదని,  రెండో దశ ఎన్నికలు 11వ తేదీన జరుగనున్నందున తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి ఎన్నికల ప్రచారం చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు