రిటర్నింగ్ అధికారులు వీరే..

10 Apr, 2014 02:16 IST|Sakshi

కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారులుగా పనిచేసే వారి వివరాలను బుధవారం కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ.. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ పత్రాలను కలెక్టర్ సమావేశ మందిరంలో స్వీకరిస్తారన్నారు.

 

అలాగే నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్ల నంద్యాల ఆర్‌డీఓ కార్యాలయంలో స్వీకరిస్తారని చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి నియోజకవర్గకేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయాల్లో స్వీకరిస్తారని తెలిపారు. కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించి గూడూరు తహశీల్దారు కార్యాలయంలో అభ్యర్థుల నుంచి నామినేషన్లు తీసుకుంటామని వివరించారు.

మరిన్ని వార్తలు