ఒక్కసారి ఓటు వేస్తే మూడు సార్లు వేసినట్లే...

30 Apr, 2014 11:02 IST|Sakshi

 ఒక్కసారి ఈవీఎంలో ఓటు వేస్తే మూడు సార్లు ఓటు వేసినట్లు కనిపించడంతో ఓటర్లు అయోమయానికి గురయ్యారు. అదే విషయాన్ని పోలింగ్ బూత్ సిబ్బందికి వెల్లడించారు. దాంతో వారు ఈవీఎంలను పరిశీలించారు. ఈవీఎంలో సాంకేతిక లోపం ఏర్పడటం వల్ల అలా జరిగిందని వారు వెల్లడించారు.

 

దాంతో పోలింగ్ నిలిపివేసి....సమాచారాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. కొత్త ఈవీఎంలు తక్షణమే ఏర్పాటు చేయాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆ ఘటన మహబూబ్నగర్ జిల్లా అలంపూర్ తాలుకా ఐజ మండలం బూమ్పురంలో బుధవారం చోటు చేసుకుంది.

మరిన్ని వార్తలు