టీఆర్ఎస్కు కరీంనగర్, రామగుండంలో కాంగ్రెస్

12 May, 2014 12:41 IST|Sakshi
టీఆర్ఎస్కు కరీంనగర్, రామగుండంలో కాంగ్రెస్

హైదరాబాద్ : కరీంనగర్ కార్పొరేషన్‌ టీఆర్ఎస్‌ గెలుచుకోగా రామగుండం కార్పొరేషన్‌ను కాంగ్రెస్‌ దక్కించుకుంది.  కరీంనగర్  కార్పొరేషన్‌లో 50స్థానాల్లో టీఆర్ఎస్‌-22స్థానాల్లో విజయం సాధించింది. రామగుండంలో 50 స్థానాలకు కాంగ్రెస్‌ 20 స్థానాలు గెలుచుకుంది. జిల్లాలో టీఆర్‌ఎస్-6, కాంగ్రెస్-2, బీజేపీ-1స్థానాలను కైవసం చేసుకున్నాయి.

జమ్మికుంట, హుజురాబాద్‌, సిరిసిల్ల, మెట్‌పల్లిలను టీఆర్ఎస్ వశమయ్యాయి. జగిత్యాల, కోరుట్ల మున్సిపాలిటీలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. వేములవాడ మునిసిపాలిటీని బీజేపీ గెలుచుకుంది. 20స్థానాలకు బీజేపీ-9, ఇండిపెండెంట్లు-6, కాంగ్రెస్‌-3, టీఆర్ఎస్‌-3 స్థానాలు గెలుచుకున్నాయి. పెద్దపల్లిలో మొత్తం 20స్థానాలకు టీఆర్ఎస్-6, కాంగ్రెస్-6, టీడీపీ-3, ఇతరులు-5 గెలిచారు.

మరిన్ని వార్తలు