అన్నకు నివాళులు.. అసెంబ్లీకి తమ్ముళ్లు..

31 Aug, 2015 08:45 IST|Sakshi

హైదరాబాద్: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ పార్టీ సంప్రదాయాన్ని అనుసరిస్తూ తెలుగుదేశం నాయకులు.. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు సమాధి వద్ద నివాళులు అర్పించారు.

సోమవారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు సహా పార్టీ ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ సమాధివద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా  'ఎన్టీఆర్ అమర్ రహే' అంటూ కార్యకర్తలు నినదించారు. పలువురు ఎమ్మెల్యేలతో మాటామంతి జరుపుతూ సీఎం చంద్రబాబు ఉల్లాసంగా కనిపించారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు  అసెంబ్లీకి బయలుదేరారు.

మరిన్ని వార్తలు