షార్ట్‌సర్క్యూట్‌తో నిలిచిన గరీబ్రథ్

30 Sep, 2015 09:46 IST|Sakshi
షార్ట్‌సర్క్యూట్‌తో నిలిచిన గరీబ్రథ్

విశాఖపట్టణం: వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తున్న గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్ సమీపంలోని మౌలాలిలో బుధవారం ఉదయం నిలిచిపోయింది. జీ-11 బోగీపైన ఉండే రేకు ఒకటి కరెంట్ లైనుకు తాకటంతో షార్ట్‌సర్క్యూట్ అయింది. దీంతో విద్యుత్ సరఫరాకు  అంతరాయం ఏర్పడి రైలు ఆగిపోయినట్లు సమాచారం. ఆ బోగీపై స్వల్పంగా మంటలు రేగటంతో భయపడిన ప్రయాణికులు కిందికి దిగిపోయారు. ఎలాంటి నష్టం వాటిల్లలేదని రైల్వే అధికారులు తెలిపారు. రైలు పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు.
 

మరిన్ని వార్తలు