పుష్కరాలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు

16 Mar, 2016 19:21 IST|Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృష్ణా పుష్కరాలపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లో జరిగిన ఈ సమావేశంలో పుష్కరాలపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేశారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, మాణిక్యలరావులను ఉపసంఘంలో సభ్యులుగా నియమించారు. ఈ సమావేశానికి మంత్రులు మాణిక్యలరావు, చినరాజప్పతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు