బస్సుభవన్ ముట్టడికి యత్నం

27 Jun, 2016 13:09 IST|Sakshi

హైదరాబాద్: పెంచిన విద్యత్, బస్సు చార్జీలకు నిరసనగా నగర బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం బస్సు భవన్ ఎదుట ధర్నా చేశారు. బస్సు భవన్ ముట్టడికి యత్నించడంతో.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ.. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు