హరితహారం కోసం సీఎం ఏరియల్ సర్వే

7 Jul, 2016 19:07 IST|Sakshi

హైదరాబాద్: ఈనెల 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ సర్వే చేయనున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆయన భూమికి చేరువగా ఈ కార్యక్రమాన్ని తిలకిస్తారు. జాతీయ రహదారిపై ఒక్క నిమిషంలో లక్ష మొక్కలను నాటే బృహత్తర యజ్ఞాన్ని కేసీఆర్ వీక్షిస్తారు. ఈ సందర్భంగా ఆయన మొక్కలు నాటే ప్రజలకు హెలికాప్టర్ నుంచే అభివాదం చేస్తారని అధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు