మహారాజా అగ్రసేన్కు కేసీఆర్ నివాళి

25 Sep, 2014 11:53 IST|Sakshi

హైదరాబాద్ : మహారాజా అగ్రసేన్ జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. బంజారాహిల్స్ రోడ్ నెం.12లో జరిగిన ఈ వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్, నాయిని నర్సింహారెడ్డి, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ తదితరులు హాజరయ్యారు.  అగ్రసేన్ జీ చిత్ర పటానికి సీఎం పూలమాల వేసి నివాళులర్పించారు.

 

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ 1969 ఉద్యమంలో అగర్వాల్స్ పాత్ర మరవలేనిదన్నారు. తెలంగాణలో వ్యాపారాలూ ప్రారంభించేవారికి సహకారం అందిస్తామని ఆయన అన్నారు. భవిష్యత్‌లో హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తుందని, అత్యున్నత పారిశ్రామిక పాలసీని అమలు చేస్తామన్నారు.

 

మరిన్ని వార్తలు