హైదరాబాద్: ఉపాధిని దెబ్బతీస్తున్నారంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్పై మంగళవారం మోండామార్కెట్ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటు వేయలేదనే అక్కసుతో తమ డెయిరీ ఫాంలను పోలీసులచే తొలగించి వేస్తున్నారని స్థానిక బండిమెట్టుకు చెందిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు గోవులను అక్కడి నుంచి అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. వీటన్నిటి వెనుక తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ పోలీస్స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.