జీఎస్టీకి నిరసనగా కాంగ్రెస్‌ ధర్నా

22 Jun, 2017 12:56 IST|Sakshi
హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం త్వరలోనే అమలు చేయనున్న జీఎస్‌టీకి నిరసనగా కాంగ్రెస్‌ నాయకులు ధర్నాకు దిగారు. వ్యవసాయ ఉత్పత్తులపై జీఎస్‌టీకి నిరసనగా గురువారం ట్యాంక్‌బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం ముందు కాంగ్రెస్‌ నేతలు వి. హనుమంతరావు ధర్నా చేపట్టారు. ఆయనకు సంఘీభావంగా మాజీ విప్‌ జగ్గారెడ్డి కూడా ధర్నాలో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ధర్నా చేస్తున్న వారిని అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. 
మరిన్ని వార్తలు