దివ్యవాణి క్రైస్తవ టీవీ చానల్ ప్రారంభం

1 Sep, 2016 03:27 IST|Sakshi

హైదరాబాద్: దివ్యవాణి క్యా థలిక్ క్రైస్తవ చానల్ బుధవారం ప్రారంభమైంది. బుధవారం సికింద్రాబాద్ సెయిం ట్ మేరీస్ స్కూ ల్ ఆవరణలో చానల్ ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వాటికన్ ప్రతినిధి ఆర్చ్ బిషప్ సాల్వతోరే ఫెన్నాఖియో ముఖ్య అతిథిగా హాజరై చానల్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాథలిక్‌ల ఆధ్వర్యంలో తొలిసారిగా తెలుగులో టీవీ చానల్ ప్రారంభించడం గర్వించదగ్గ విషయమన్నారు. హైదరాబాద్ ఆర్చ్ బిషప్ తుమ్మబాల మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రసారం చేస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు దివ్యవాణి చానల్ ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్టణం ఆర్చ్ బిషప్ మల్లవరకు ప్రకాశ్, టీవీ చానల్ సీఈవో ఫాదర్ ఉడుముల బాలశౌరి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు