రైతుల పేరిట డ్రామాలు

14 Dec, 2016 03:05 IST|Sakshi
రైతుల పేరిట డ్రామాలు

కాంగ్రెస్, టీడీపీలపై టీఆర్‌ఎస్‌ నేత నోముల ధ్వజం
సాక్షి, హైదరాబాద్‌: రైతులను అడ్డం పెట్టుకుని సీఎం కేసీ ఆర్‌ను అపనిందల పాలు చేయాలని ప్రతిపక్షాలు చూస్తు న్నాయని టీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య విమ ర్శించారు. నాగార్జున సాగర్‌ డెడ్‌ స్టోరే జీలో ఉన్నా రెండు పంటలకు నీరిచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మంగళవారం తెలంగాణ భవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎంపై విమర్శలు చేస్తున్న సీఎల్పీ నేత జానారెడ్డి 30 ఏళ్లుగా నాగార్జున సాగర్‌ నియోజకవర్గాన్ని ఎందుకు పట్టించు కోలేదని ప్రశ్నించారు. ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్న జానా దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని, లేకుంటే రాజకీయ సన్యా సం తీసుకోవాలని సవాలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అడ్డగోలు కార్య క్రమాలు చేస్తున్నాడని తీవ్రంగా మండిపడ్డారు.

మరిన్ని వార్తలు