8 మంది పేకాట రాయుళ్ల అరెస్టు

5 Oct, 2016 13:01 IST|Sakshi
హైదరాబాద్: అంబర్‌పేట పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేసి, 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం గోల్నాకలోని పెరల్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో కొందరు పేకాడుతున్నారన్న సమాచారం మేరకు దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాడుతున్న 8మందిని అదుపులోకి తీసుకోవటంతో పాటు వారి నుంచి 7 సెల్‌ఫోన్లు రూ. 33,250 స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేశారు.
 
 
మరిన్ని వార్తలు