శిథిలావస్థ భవనాల కూల్చివేత

30 Jul, 2016 20:23 IST|Sakshi

హైదరాబాద్: నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో.. పాత భవనాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో జీహెచ్‌ఎంసీ అధికారులు శిథిలావస్థకు వచ్చిన పాత భవనాలపై దృష్టి సారించారు.

సికింద్రాబాద్ పరిధిలో ఈ రోజు పర్యటించిన జీహెచ్‌ఎంసీ కమీషనర్ జనార్థన్‌రెడ్డి శిథిలావస్థకు చేరిన పలు భవనాలను గుర్తించి కూల్చివేయాలని సిబ్బందికి సూచించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు పురాతన బిల్డింగులు కూల్చి వేస్తున్నారు.

మరిన్ని వార్తలు