'ఆర్డీఎస్'పై కర్ణాటకతో చర్చించనున్న టీ.సర్కార్

23 Apr, 2016 14:46 IST|Sakshi

హైదరాబాద్ : రాజోలిబండ వివాదంపై కర్ణాటకతో చర్చలు జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అందులోభాగంగా తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు ఏప్రిల్ 28వ తేదీన బెంగళూరు వెళ్లనున్నారు. కర్ణాటక సాగునీటి శాఖ మంత్రి ఎం.బి.పాటిల్తో హరీశ్రావు సమావేశమై... రాజోలిబండ వివాదంపై చర్చించనున్నారు. రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ద్వారా మహబూబ్నగర్ జిల్లా రైతులకు నీటిని అందించడం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

మరిన్ని వార్తలు