రేపిస్ట్ లను పట్టుకోమన్నందుకు.. దాడికి యత్నం

6 Feb, 2015 13:04 IST|Sakshi
రేపిస్ట్ లను పట్టుకోమన్నందుకు.. దాడికి యత్నం

హైదరాబాద్ : సామాజిక కార్యకర్త,   ప్రజ్వల సంస్థ నిర్వహిస్తున్న సునీతా కృష్ణన్పై శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు దాడికి యత్నించారు. ఆమె కారుపై దుండగులు రాళ్లు రువ్వారు. కారు అద్దాలు ధ్వంసం చేశారు.  హైదరాబాద్ పాతబస్తీలో ఈ సంఘటన జరిగింది.  వివరాల్లోకి వెళితే..

ఓ అమ్మాయిని అయిదుగురు యువకులు ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. అన్నా విడిచి పెట్టండని ఆమె వేడుకున్నా అరణ్య రోదనే అయ్యింది. ఆ మృగాలు.. సామూహిక అత్యాచారాన్ని వీడియోలో చిత్రీకరించారు. తాము చేస్తుందేదో ఘనకార్యం అంటూ నవ్వుతూ వీడియోకు ఫోజులు ఇచ్చారు. సుమారు ఆరు నెలల క్రితం ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ  వీడియో వాట్సప్‌లో ప్రచారంలో ఉంది. ఆ వీడియో సునీతా కృష్ణన్‌కు కూడా వీడియో చేరింది.  దాంతో ఆ దుర్మార్గులు ఎవరు ? ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకునే పనిలో పడ్డారు.

ఈ రేపిస్టులను గుర్తించండి అంటూ..  సునీతా కృష్ణన్ యూ ట్యూబ్‌లో ఆ వీడియోను నిన్న పోస్ట్‌ చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు కృషి చేయాలని కోరారు. రేపిస్టులకు తగిన శిక్ష పడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ దారుణ ఘటనపై యూ ట్యూబ్‌లో పోస్ట్‌ చేసిన వెంటనే....  సునీతా కృష్ణన్‌ వాహనంపై గుర్తు తెలియని దుండగలు దాడి చేశారు. కలకలం రేపిన ఈ ఘటనపై కేంద్ర స్త్రీ, శిశుసంక్షేమ మంత్రిత్వ శాఖ దృష్టి స్పందించింది. బాధ్యులు ఎవరో తెలుసుకునే పనిలో పడింది. సైబర్‌ క్రైం పోలీసుల సహకారంతో ఎక్కడి నుంచి ఈ ఫుటేజ్‌ బయటకు వచ్చిందో విచారణ ప్రారంభించారు.

>
మరిన్ని వార్తలు