ఎస్సై ఆత్మహత్య ఘటనపై హెచ్చార్సీ ఆగ్రహం

19 Aug, 2016 17:23 IST|Sakshi

ఉన్నతాధికారుల ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకున్న కుకునూర్‌పల్లి ఎస్సై రామకృష్ణారెడ్డి ఆత్మహత్య ఘటనపై మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ కేసును సుమోటోగా స్వీకరించిన హెచ్చార్సీ ఆత్మహత్యకు గల కారణాలపై సమగ్ర నివేదిక అందివ్వాలని హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, డీజీపీలకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 30 లోగా నివేదిక అందించాలని ఆదేశించింది.

మరిన్ని వార్తలు