సంతోష్నగర్లో కార్డన్ సెర్చ్: అనుమానితులు అరెస్ట్

16 Mar, 2016 08:21 IST|Sakshi

హైదరాబాద్ : నగరంలోని సంతోష్నగర్లో పోలీసులు బుధవారం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. 300 మంది పోలీసులతో విస్తృత తనిఖీలు జరుపుతున్నారు.  సంతోష్నగర్ ప్రాంతాన్ని వారు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. అందులోభాగంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న 56 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుంచి 10 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 23 వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. సౌత్జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు