పేలుడు పదార్థాల అక్రమ రవాణ ముఠా అరెస్ట్

29 Oct, 2015 16:06 IST|Sakshi

పేలుడు పదార్థాలను అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురు యువకులను రాజేంద్రనరగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రహదారి పై వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో బైక్‌పై పెలుడు పదార్థాలను తీసుకెళుతున్న నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారు.

వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 150 జిలెటిన్ స్టిక్స్, 150 డిటోనేటర్స్‌తో పాటు ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాల అక్రమ రవాణ కింద కేసు నమోదు చేసిన పోలీసులు వీటిని ఎక్కడికి తీసుకువెళుతున్నారు..? ఎక్కడి నుంచి తెచ్చారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు