'నారాయణ' విద్యార్థి అదృశ‍్యం

10 Jun, 2017 12:28 IST|Sakshi
హైదరాబాద్‌: నారాయణ కళాశాలలో ఇంటర్‌ విద్యార్థి అదృశ్యమైన సంఘటన కలకలం రేపుతోంది. నల్లగొండ జిల్లా హాలియ పట్టణానికి చెందిన గౌరీశంకర్‌ మాదాపూర్‌లోని నారాయణ సమతా క్యాంపస్‌లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో గత మూడు రోజులుగా గౌరీ శంకర్‌ కనిపించడం లేదు.
 
అయినా కాలేజ్‌ యాజమాన్యం పట్టించుకోలేదు..విద్యార్థి  అదృశ్యంపై తల్లిదండ్రులకు కనీస సమాచారం ఇవ్వలేదు. కాగా తోటి విద్యార్థుల ద్వారా విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. తమ కుమారుడి ఆచూకీ తెలయజేయాలని కోరుతూ విద్యార్థులతో కలిసి ధర్నా చేశారు. 
మరిన్ని వార్తలు