తాగిన మైకంలో ముగ్గురిపై కత్తితో దాడి

17 May, 2015 21:12 IST|Sakshi

హైదరాబాద్ సిటీ: సైదాబాద్ పరిధిలో ఆదివారం రాత్రి అహ్మద్ అనే వ్యక్తి తాగిన మైకంలో కత్తితో ముగ్గురిపై పాశవికంగా దాడిచేశాడు. ఈ ఘటనలో శివ, కృష్ణ, సైదులు అనే ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు.

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా నిందితుడు తాగిన మైకంలో దాడి చేసి పలువురిని గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు