స్వైన్‌ఫ్లూతో మరో చిన్నారి మృతి

27 Jan, 2017 15:16 IST|Sakshi
హైదరాబాద్‌: స్వైన్‌ఫ్లూతో మరో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. యాదాద్రి జిల్లా బీబీనగర్‌ మండలం జములపేటకు చెందిన పది నెలల చిన్నారి ఈనెల 20వ తేదీన గాంధీ ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతున్న చిన్నారి 26వ తేదీ రాత్రి చనిపోయింది. ఇదిలా ఉండగా, చార్మినార్‌ ప్రాంతానికి చెందిన పది నెలల వయస్సు బాలుడు స్వైన్‌ఫ్లూ లక్షణాలతో శుక్రవారం గాంధీ ఆస్పత్రిలో చేరాడు. దీంతో గాంధీలో చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య 12 కు చేరింది.
మరిన్ని వార్తలు