హైదరాబాద్సిటీ: కందుకూరు పరిధిలో పేకాట స్థావరంపై ఆదివారం పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. అందిన సమాచారం మేరకు పోలీసులు పేకాటాడుతున్న ఏడుగురి అరెస్ట్ చేశారు.
వారి నుంచి సుమారు రూ.35 వేల నగదు, 7 సెల్ఫోన్లు, రెండు సెట్ల కార్డులు, 3 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.