పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే వద్ద ప్రమాదం

24 Jan, 2018 16:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ హైవే వద్ద బుధవారం ప్రమాదం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్‌లోని పిల్లర్‌ నంబర్‌ 284 వద్ద ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. శంషాబాద్‌ నుంచి మెహదీపట్నం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి వచ్చి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

మరిన్ని వార్తలు