ఫోర్జరీ కేసులో ముగ్గురి ఉద్యోగుల అరెస్ట్

16 Mar, 2016 18:14 IST|Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ ఫోర్జరీ కేసులో ముగ్గురు ఉద్యోగులను బుధవారం ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. కార్పొరేషన్ ఫిక్స్డ్ డిపాజిట్లను ఫోర్జరీ సంతకాలతో డబ్బును స్వాహా చేసిన ఉదంతంపై సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. సుబ్రమణ్యం, బి.నారాయణ, బి.శ్రీనివాసులు అనే హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు