టుడే న్యూస్ డైరీ

12 Mar, 2016 07:11 IST|Sakshi

తెలంగాణ అసెంబ్లీ: తెలంగాణ అసెంబ్లీలో నేడు గవర్నర్ ప్రసంగంపై చర్చ. నేటి సమావేశంలో జీహెచ్ఎంసీ సవరణ బిల్లు, భూసేకరణ బిల్లు చర్చకు రానున్నాయి.

ఢిల్లీ: ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.

వైఎస్ఆర్ సీపీ ఆవిర్భావ దినోత్సవం: నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. అన్ని జిల్లాల్లో పార్టీ జెండాలు ఎగురవేసి సేవా కార్యక్రమాలు నిర్వహించనున్న పార్టీ నేతలు.

క్రికెట్ మ్యాచ్: ప్రపంచ కప్ టీ 20 రెండో వార్మప్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో తలపడనున్న భారత జట్టు.
 
ముఖ్యమంత్రి పర్యటన: నేడు లండన్లో ప్రవాస తెలుగువారితో సమావేశం కానున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

టీ20 వరల్డ్ కప్: నేడు పాకిస్థాన్ క్రికెట్ జట్టు భారత్కు రానుంది. ఈ నెల 19న భారత్, పాక్లు కోల్కతాలో తలపడనున్నాయి.

మరిన్ని వార్తలు