రేపు రహదారుల దిగ్బంధం: రఘువీరా

9 Sep, 2016 03:30 IST|Sakshi
రేపు రహదారుల దిగ్బంధం: రఘువీరా

సాక్షి, అమరావతి/మడకశిర : హోదా ఇవ్వకుండా వంచించిన బీజేపీ, టీడీపీ తీరుకు నిరసనగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జాతీయ రహదారులను దిగ్బంధం చేయనున్నట్లు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి గురువారం ఓ ప్రకటనలో ప్రకటించారు. ఆ రెండు పార్టీలు చేసిన మోసానికి నిరసనగా ఈ నెల 18 నుంచి అక్టోబర్ 7 వరకు  రిలే దీక్షలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.  ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వలేమని కేంద్రం ప్రకటించడాన్ని నిరసిస్తూ గురువారం ర ఘువీరా మడకశిరలోని రాజీవ్‌గాంధీ సర్కిల్‌లో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

>
మరిన్ని వార్తలు