రాష్ట్రంలో ‘వైద్యం’ దిగజారింది.. ఆదుకోండి

11 May, 2016 03:42 IST|Sakshi

కేంద్రమంత్రి నడ్డాకు కామినేని లేఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య ఆరోగ్య పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ముఖ్యంగా రాష్ట్రం విడిపోయాక పూర్తిగా దిగజారిపోయాయని.. ఇప్పటికైనా ఆదుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను కోరుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ మంగళవారం లేఖ రాశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇటీవలి స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో కామినేని నిధులకోసం కేంద్రాన్ని అర్థిస్తూ లేఖ రాశారు. కేంద్రమంత్రిని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు.

మరిన్ని వార్తలు