భవనానికి నీళ్లు కొడుతుంటే..

16 May, 2016 12:27 IST|Sakshi

హైదరాబాద్‌సిటీ: విధుల్లో ఉన్న ఓ వాచ్‌మన్ విద్యుత్ షాక్ తగిలి మృతిచెందాడు. విద్యుత్ షాక్ తగలడంతో ఎం.రాయ్ అనే వాచ్‌మన్ అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.

ఈ ఘటన నారాయణగూడ మెల్కొటియా పార్కు సమీపంలో నిర్మాణంలో ఉన్న పవర్ సబ్‌స్టేషన్‌లో శనివారం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనానికి నీళ్లు కొడుతుండగా అతడికి కరెంట్ షాక్ తగిలింది.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

మరిన్ని వార్తలు