-
పెళ్లయిన రెండు రోజులకే..
ఆ యువకుడు కోరుకున్న యువతినే పెళ్లి చేసుకున్నాడు. జీవిత భాగస్వామితో జీవితాన్ని సంతోషంగా గడపాలని కలలుగన్నాడు. ఈడూజోడు చక్కగా ఉన్న ఆ జంటను చూసి అందరూ సంతోషించారు. ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. పసుపు దుస్తులు కూడా విప్పకుండానే మృత్యువు విద్యుత్ రూపంలో అతన్ని పొట్టన పెట్టుకుంది. కాళ్లపారాణి ఆరకనే, ఇంటిముందు వేసిన పందిరి తీయకనే వైధవ్యానికి గురికావడంతో ఆ యువతి చేస్తున్న రోదనలు అన్నీ ఇన్నీ కావు. నీతోపాటే నన్ను కూడా తీసుకుపోకూడదా సామీ.. అంటూ ఆమె ఆర్తనాదాలను చూసి స్థానికులు కంటతడి పెట్టారు. ఈ సంఘటన ములకలచెరువు మండలంలో శనివారం చోటుచేసుకుంది. ► మొబైల్ ఫోన్కు చార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్ ► నవ వరుడు మృతి ► మృతుడు కర్ణాటక వాసి ► కనుగొండవారిపల్లెలో విషాదఛాయలు ములకలచెరువు /మదనపల్లె క్రైం: మొబైల్ చార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్ గురై నవ వరుడు దుర్మరణం చెందిన సంఘటన ములకలచెరువు మండలంలో జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రం బాగేపల్లె మండలం పరగోడుకు చెందిన మిద్ది నరసింహప్ప, నరసమ్మ దంపతుల కుమారుడు నరసింహులు(24) కర్ణాటక ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఈ నెల 23న ములకలచెరువు మండలం గూడుపల్లి పంచాయతీ కనుగొండవారిపల్లె ఎస్సీ కాలనీకి చెందిన యాట వెంకటరమణ, రెడ్డెమ్మ దంపతుల కుమార్తె ప్రమీల(20)తో పెళ్లి జరిగింది. శుక్రవారం నవ దంపతులు కనుగొండవారిపల్లెకు మరువులకు వచ్చారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇద్దరూ నిద్రించారు. శనివారం తెల్లవారుజామున నరసింహులు తన మొబైల్కు చార్జింగ్ పెట్టేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఓవర్లోడు రావడంతో షాక్కు గురయ్యాడు. నరసింహులు గట్టిగా కేకలు వేస్తూ కింద పడిపోయాడు. వెంటనే నిద్ర నుంచి మేల్కొన్న ప్రమీల తీవ్రంగా గాయపడిన భర్తను కుటుంబ సభ్యుల సహకారంతో 108లో మదనపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతిచెందాడు. పెళ్లయి మూడు రోజులు కూడా కాకుండానే భర్త మృతిచెందడంతో ప్రమీల గుండెలు పగిలేలా రోదించింది. ఇక నాకు దిక్కెవరు, నన్ను కూడా నీతోపాటు తీసుకెళ్లిపోరాదా అంటూ తలను నేలకేసి బాదుకుంది. ఆమెను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. నరసింహులు మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు, వారి బంధువులు, ప్రమీల కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి పెద్ద సంఖ్యలో చేరుకుని బోరున విలపించారు. కనుగొండవారిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. ములకలచెరువు ఎస్ఐ ఈశ్వరయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. ట్రాన్స్ కో నిర్లక్ష్యమే ప్రాణాలు తీసిందా కొత్తమీటర్లు బిగించేందుకు ట్రాన్స్ కో అధికారులు ఇటీవల కనుగొండవారిపల్లె దళితవాడకు విద్యుత్ పాత మీటర్ల ను తొలగించారు. వారు తిరిగి కొత్తమీటర్లు బిగించకపోగా ఇళ్లకు డైరెక్ట్గా కరెంట్ సర్వీసులు ఇచ్చి వెళ్లిపోయారు. 2 నెలలుగా అధికారులు మీటర్లు అమర్చకుండా కాలయాపన చేయడం వల్ల విద్యుత్ ఓవర్ లోడు వస్తోంది. గ్రామంలోని భాస్కర్, అనిల్ విద్యుత్ షాక్కు గురైనట్టు గ్రామస్తులు తెలిపారు. నరసింహులు చావుకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. -
భవనానికి నీళ్లు కొడుతుంటే..
హైదరాబాద్సిటీ: విధుల్లో ఉన్న ఓ వాచ్మన్ విద్యుత్ షాక్ తగిలి మృతిచెందాడు. విద్యుత్ షాక్ తగలడంతో ఎం.రాయ్ అనే వాచ్మన్ అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన నారాయణగూడ మెల్కొటియా పార్కు సమీపంలో నిర్మాణంలో ఉన్న పవర్ సబ్స్టేషన్లో శనివారం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనానికి నీళ్లు కొడుతుండగా అతడికి కరెంట్ షాక్ తగిలింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
కెరిమెర(ఆదిలాబాద్ జిల్లా) ఆదిలాబాద్ జిల్లా కెరిమెర మండలం జోడేఘాట్ గ్రామంలో బంధువుల ఇంటికి చుట్టపు చూపుగా వచ్చిన ఓ వ్యక్తి బుధవారం మధ్యాహ్నం కరెంట్ షాక్తో మృతిచెందాడు. మహారాష్ట్ర సరిహద్దులోని వాంక్రీ గ్రామానికి చెందిన పుర్తెంగరావు(40) తన మేనమామ ఇంటికి జోడేఘాట్కు వచ్చాడు. బుధవారం మధ్యాహ్నం ఇంట్లో సెల్ఫోన్కు చార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పూజలు
బుధవారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2024
నిండు వేసవిలో..
విద్యార్థులు పట్టుదలతో చదవాలి
అకాలవర్షం.. అమ్ముకోకుండా చేస్తోంది
ప్రజాస్వామ్యంలో ఓటు విలువైంది..
అడిషనల్ కలెక్టర్ ప్రత్యేక పూజలు
Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
అలర్ట్గా ఉన్నాం..
ఆరోగ్యశ్రీతో ఆసుపత్రి మరింత అభివృద్ధి
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement