-

'సక్రమంగా పనిచేయని డాక్టర్లను తొలగిస్తాం'

23 May, 2016 18:58 IST|Sakshi
'సక్రమంగా పనిచేయని డాక్టర్లను తొలగిస్తాం'

హైదరాబాద్: సక్రమంగా విధులు నిర్వహించని డాక్టర్లను తొలగిస్తామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ హెచ్చరించారు. సోమవారం ఆయన వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించారు. వైద్యులు సక్రమంగా విధులు నిర్వహించకపోతే ఉపేక్షించేది లేదన్నారు.

ప్రభుత్వ వైద్యల పదవీ విరమణ 65 ఏళ్లకు పెంచాలని యోచిస్తున్నట్టు తెలిపారు. జూన్ 8 నుంచి 15 వరకు వైద్య శాఖలో బదిలీలు నిర్వహిస్తామని మంత్రి కామినేని వెల్లడించారు.

మరిన్ని వార్తలు