తుపాను నిధికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల విరాళం

1 Nov, 2014 02:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: హుద్‌హుద్ తుఫాన్ బాధితులను అదుకునేందుకు వైఎస్సార్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన తుపాను సహాయ నిధికి ఇద్దరు ఎమ్మెల్యేలు లక్ష చొప్పన విరాళం ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మేకా ప్రతాప అప్పారావు, కొక్కిలగడ్డ రక్షణనిధిలు తమ ఎమ్మెల్యేల వేతనం నుంచి చెరో లక్ష రూపాయల సహాయ నిధికి అందజేశారు. ఇరువురు నాయకులు  శుక్రవారం పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి చెక్కులను అందజేశారు.

మరిన్ని వార్తలు